News February 25, 2025

NRPT: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాలను సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ‘ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట’ వివిధ రకాల సురక్షితమైన పొదుపు వర్గాలను ఎంచుకొని భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు.

Similar News

News December 17, 2025

ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

image

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్‌లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.

News December 17, 2025

IPL వేలం.. రాజస్థాన్ టీమ్‌లో కరీంనగర్‌ కుర్రాడు

image

ఐపీఎల్ వేలంలో కరీంనగర్ అబ్బాయి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం రూ.30 లక్షలకు దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన అతణ్ని అంతే ధరకు సొంత చేసుకుంది. ఇప్పటికే HCA అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన చేశారు. అండర్-23 SMATలో 160+ స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అయితే IPLలో రాణించి కరీంనగర్‌కు పేరు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

News December 17, 2025

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

image

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.