News March 13, 2025

NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

image

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.

Similar News

News February 26, 2026

ఖమ్మం: ఉపసర్పంచ్ పదవికి సర్పంచ్ భార్య రాజీనామా

image

తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం ఉపసర్పంచ్ కుంభం యమున తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భర్త ఉపేందర్ సర్పంచ్‌గా, భార్య యమున ఉపసర్పంచ్‌గా ఎన్నికై భార్యాభర్తలు గ్రామాన్ని ఏలుతూ వార్తల్లో నిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం మూడు నెలలకే రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.

News February 26, 2026

సంపూర్ణ ఆరోగ్యం కోసం ‘ధన్వంతరి గాయత్రీ మంత్రం’

image

ధన్వంతరి గాయత్రీ మంత్రం అతి పవిత్రమైంది. ఇది మన బుద్ధిని ప్రేరేపించి, జీవశక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యాలను పఠిస్తే అనంత శక్తి సొంతమవుతుందని పండితులు అంటున్నారు. మానసిక స్పష్టత, దివ్యమైన మార్గదర్శకత్వం కోసం దీన్ని పఠించాలని చెబుతున్నారు. మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే| అమృత కలశ హస్తాయ ధీమహి| తన్నో ధన్వంతరి ప్రచోదయాత్||