News March 13, 2025
NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
Similar News
News February 12, 2026
నార్త్ కొరియా తదుపరి లీడర్గా కిమ్ జు ఏ?

ఉత్తర కొరియా తదుపరి లీడర్గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 12, 2026
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
News February 12, 2026
మంచిర్యాల: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.


