News March 8, 2025
NRPT: ఇంటర్ పరీక్షకు 4553 మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 4553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం విద్యార్థులు 4702 కాగా, వారిలో 149 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని చెప్పారు. మరికల్, మక్తల్ గురుకుల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారని చెప్పారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.
Similar News
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.
News December 10, 2025
పోలింగ్ తేదీల్లో సెలవు.. కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లాలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా, పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే (డిసెంబర్ 11, 14 & 17) ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు సెలవు ఉంటుంది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే ఉద్దేశంగా ఈ వీలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 10, 2025
బ్లాక్ మెయిల్ కాల్స్పై అప్రమత్తంగా ఉండండి: DEO

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.


