News March 8, 2025
NRPT: ఇంటర్ పరీక్షకు 4553 మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 4553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం విద్యార్థులు 4702 కాగా, వారిలో 149 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని చెప్పారు. మరికల్, మక్తల్ గురుకుల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారని చెప్పారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.
Similar News
News December 5, 2025
ములుగు: ఆ ఒక్కరోజు తేడా వస్తే అంతే సంగతి!

పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఓటింగ్ ముందు రోజు అత్యంత కీలకం కానుంది. ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత సింపతీ కూడగట్టుకున్నా ఆ ఒక్కరోజు ఓటర్లను వశం చేసుకోవడం పెద్ద టాస్క్. పంపకాల్లో తేడా వస్తే చేసిన ప్రచారం, అభివృద్ధి, హామీలు నీరుగారిపోయినట్లేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ములుగు(D)లో ఈసారి ప్రధాన, ప్రతిపక్ష అభ్యర్థులే అనేకచోట్ల బరిలో ఉండటంతో అంచనాలు పెరిగాయి.
News December 5, 2025
విజయోత్సవ ర్యాలీలు, డీజేలు నిషేధం: సూర్యాపేట ఎస్పీ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు. ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. బాణాసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమన్నారు.
News December 5, 2025
KMR: పనులు చేయకపోతే రాజీనామా.. సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్

సర్పంచ్ ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ కొనసాగుతోంది. మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే తనను గెలిపిస్తే కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలు నెరవేర్చకపోతే తన పదవీకి రాజీనామ చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటనన్నారు.


