News March 7, 2025
NRPT: ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు 149 మంది గైర్హాజరు

నారాయణపేట జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 4,702 మంది విద్యార్థులకు గాను, 4553 విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు DIEO అధికారులు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 23, 2025
SRD: డీసీసీ పదవి.. ముగ్గురు మొనగాళ్లు!

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను శనివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట జిల్లాలను సైతం ఈ జాబితాలో చేర్చారు. సంగారెడ్డి DCC అధ్యక్ష పదవిని పెండింగ్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఆశావహుల కోసం ముగ్గురు కీలక నేతలు పావులు కదపడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తర్జనభర్జన పడి చివరకు SRDని పక్కన పెట్టారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


