News March 7, 2025

NRPT: ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు 149 మంది గైర్హాజరు

image

నారాయణపేట జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 4,702 మంది విద్యార్థులకు గాను, 4553 విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు DIEO అధికారులు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News October 14, 2025

ఎచ్చెర్ల: క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తుల ఆహ్వానం

image

ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేయాలన్నారు.

News October 14, 2025

ఏపీ రౌండప్

image

* ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల బదిలీ.. గుజరాత్ HC నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ నుంచి జస్టిస్ డూండి రమేశ్, కోల్‌కతా నుంచి జస్టిస్ సుబేందు సమంత బదిలీ
* వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు మినీ రత్న హోదా
* కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ అంతార్ సింగ్ ఆర్యకు YCP నేతల ఫిర్యాదు
* విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు

News October 14, 2025

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌తో కలెక్టర్ సమావేశం

image

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి పారిశ్రామిక భద్రతా కమిటీ క్రైసిస్ గ్రూపుల కమిటీ సమావేశాన్ని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, సేఫ్టీ అధికారులతో కలసి కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేటగిరీల వారీగా 36 పరిశ్రమలు మీద భద్రత ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఫ్యాక్టరీలో ఎస్ఓను ఏర్పాటు చేయాలన్నారు.