News March 7, 2025
NRPT: ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు 149 మంది గైర్హాజరు

నారాయణపేట జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 4,702 మంది విద్యార్థులకు గాను, 4553 విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు DIEO అధికారులు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 7, 2025
దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.
News November 7, 2025
తెనాలి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

తెనాలి చెంచుపేటలోని కోనేరు బజారులోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. విటుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని, నిర్వాహకురాలికి ఫోన్ ద్వారా నగదు చెల్లించిన ఆధారంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News November 7, 2025
మరోసారి ‘నో హ్యాండ్ షేక్’!

భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ‘నో హ్యాండ్ షేక్’ వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్లో, మహిళల ప్రపంచ కప్లో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తెలిసిందే. ఇవాళ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలోనూ ఇది రిపీట్ అయింది. ఇండియా మ్యాచ్ <<18225529>>గెలిచిన <<>>కొన్నిక్షణాలకే ప్రసారం ముగిసింది. ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. రెండు టీమ్స్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే ఉండిపోయాయని సమాచారం.


