News June 7, 2024
NRPT: ఇంటింటి సర్వే పూర్తి చేయండి: కలెక్టర్

మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ లపై ఇంటింటి సర్వేను వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరెట్ లో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంత మందికి నీటి కనెక్షన్ ఇచ్చారు. ఎన్ని ఇళ్లకు ఇవ్వాల్సి వుంది అనే విషయలను సర్వే చేసి మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. సర్వేకు నలుగురు మాస్టర్ ట్రైనర్ లను అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.
News November 30, 2025
ALERT: ప్రజావాణి రద్దు: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
News November 30, 2025
MBNR: నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసేందుకు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డి.జానకి కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో విడత నామినేషన్ కేంద్రాలైన కోయిలకొండ, సంగినోని పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్, శేరివెంకటపూర్, సూరారం, ఖాజీపూర్ గ్రామాలను వరుసగా సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సై తిరుపాజి పాల్గొన్నారు.


