News April 4, 2025
NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.
Similar News
News November 20, 2025
ఈ ఉద్యమమే టెక్ శంకర్ను మావోయిస్టుగా మార్చింది

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.
News November 20, 2025
తిరుపతి: బ్లాక్ మనీని వైట్గా మార్చారు ఇలా..!

మద్యం స్కాం డబ్బులతోనే చెవిరెడ్డి కుటుంబం స్థలాలు కొనిందని.. వాటిని జప్తు చేయాలని ACB కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. 2021 నుంచి 2023 వరకు చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్ల విలువైన స్థిరాస్థులు కొనిందంట. రికార్డుల్లో రూ.8.85కోట్లుగానే చూపించి 54.87 కోట్లు వైట్ మనీగా మార్చారని సిట్ తన దర్యాప్తులో తేల్చిందంట. వడమాలపేట, తిరుపతి, తొట్టంబేడు, కేవీబీపురం, గూడూరు మండలాల్లో ఈ స్థలాలు కొనుగోలు చేశారు.
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


