News February 21, 2025

NRPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడంతో పాటు రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2025

నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్‌లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2025

APPSC పరీక్షల తేదీలు ప్రకటన

image

AP: పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు <>ఎగ్జామ్స్ నిర్వహిస్తామంది.<<>> కాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 91, జూనియర్ కాలేజీల్లో 47, డిగ్రీ కాలేజీల్లో 240, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో 78 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసింది.

News March 21, 2025

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

image

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారిరువురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.

error: Content is protected !!