News September 14, 2024
NRPT: ఇక్కడ 48 ఏళ్లుగా ఆ ఊరిలో ఒకే దేవుడు..!

నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే గణనాథుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.
Similar News
News January 5, 2026
MBNR: పీయూ.. ఈనెల 7న క్రికెట్ ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీ పురుషుల, స్త్రీల క్రికెట్ జట్ల ఎంపికలు ఈనెల 7న MBNRలోని ‘MDCA’ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొ. జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరుకావాలని సూచించారు.
News January 5, 2026
MBNR: ‘పీఎంశ్రీ’.. జిల్లా స్థాయి పోటీల షెడ్యూల్

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారులు సిద్ధం కావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. షెడ్యూలు ఇలా!
✒6న బాల,బాలికలకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు
✒6న బాల, బాలికలకు ఫుట్ బాల్ అథ్లెటిక్స్ పోటీలు
అథ్లెటిక్స్లో పాల్గొనే పియంశ్రీ పాఠశాల క్రీడాకారులు ఒక్క ఈవెంట్లో ఒక్కరు మాత్రమే పాల్గొనాలన్నారు.
News January 5, 2026
మహబూబ్నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


