News April 1, 2025
NRPT: ఈ పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

జిల్లా యువతకు ఆర్థికచేయూత అందించడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం “రాజీవ్ యువ వికాస్”. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మొదట చివరి తేదీ ఏప్రిల్ 5 కాగా.. దరఖాస్తుల స్వీకరణలో రాష్ట్రసర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడగించింది. దీంతో జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT.
Similar News
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.
News November 25, 2025
VJA: భవానీలకు ఉచిత బస్సులు.. వసతుల కల్పనకు చర్యలు.!

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీలు మాలవిరమణకు రానున్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఏర్పాట్లలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి భక్తుల కోసం 17 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, క్లోరినేషన్, కేశఖండనశాలలో సిబ్బంది, ఉచిత ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


