News April 13, 2025
NRPT: కమాండ్ కంట్రోల్ రూమ్లో శోభాయాత్ర పర్యవేక్షణ

నారాయణపేట జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపును ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 58 చోట్ల శోభాయాత్ర నిర్వహించారని చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాలను డైవర్షన్ చేశామని చెప్పారు.
Similar News
News September 17, 2025
అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా పనితీరు ఉండాలి: లక్ష్మీశా

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల ఆదాయాలను పెంచడానికి దోహదపడే ఉద్యానవన, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News September 17, 2025
సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సమీక్ష

వరంగల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రంగలీల మైదానంలో జరుగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మేయర్, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్తో ఆమె చర్చించారు. వేడుకలను ఘనంగా, సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.