News April 13, 2025

NRPT: కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శోభాయాత్ర పర్యవేక్షణ

image

నారాయణపేట జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపును ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 58 చోట్ల శోభాయాత్ర నిర్వహించారని చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాలను డైవర్షన్ చేశామని చెప్పారు.

Similar News

News October 26, 2025

సిరిసిల్ల: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికో.. ?

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మద్యం పాలసీ 2025-27కు ఎక్సైజ్ అధికారులు రేపు డ్రా తీయనున్నారు. జిల్లాలోని మొత్తం 48 దుకాణాలకు 1,381 దరఖాస్తులు వచ్చాయని, దీంతో రూ.41.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. జిల్లెల వైన్స్‌కు అత్యధికంగా 53 దరఖాస్తులు రాగా, రుద్రంగి వైన్స్‌కు అత్యల్పంగా 15 దరఖాస్తులు వచ్చాయి. రేపటి లక్కీ డ్రాలో టెండర్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

News October 26, 2025

నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.

News October 26, 2025

మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

image

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.