News January 27, 2025
NRPT: కలెక్టరేట్ ప్రజావాణిలో 28 ఫిర్యాదులు

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 28
ఫిర్యాదులు అందాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవో రామచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కనిష్ఠంగా 8.7 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠంగా ఆసిఫాబాద్లోని లింగాపూర్లో 8.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది.
News November 12, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.73,18,504

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామి వారికి 76 రోజుల్లో రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేష్ తెలిపారు. 80 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి, 21 విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News November 12, 2025
32,438 పోస్టులు.. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు

రేపటి నుంచి గ్రూప్-D <<17650787>>పరీక్షలకు<<>> సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు RRB(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) తెలిపింది. 32,438 పోస్టులకు ఈ నెల 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చంది. ఎగ్జామ్కు 10 రోజుల ముందుగానే పరీక్ష తేదీ, సిటీ వివరాలను RRB వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.


