News April 13, 2024

NRPT: ‘కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి’

image

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలను కలిసికట్టుగా తిప్పి కొట్టాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశినాథ్ అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో నిర్వహించిన జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. కేంద్రం మతాల మధ్య చిచ్చులు పెట్టి ఘర్షణలు సృష్టిస్తోందని అన్నారు. కార్పోరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

Similar News

News October 11, 2024

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News October 11, 2024

వనపర్తి: స్వీపర్‌ కూతురు టీచర్..!

image

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్‌గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.

News October 11, 2024

ఉమ్మడి జిల్లాకు 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. జడ్చర్ల, దేవరకద్ర, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొడంగల్, కొందుర్గు పట్టణాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల నిర్మాణానికి పూజలు చేస్తున్నారు.