News March 18, 2025

NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

image

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం  జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 22, 2025

గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’ 

image

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.

News March 22, 2025

ఆ జట్లు తలపడితే భారీ క్రేజ్: హర్భజన్ సింగ్

image

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, ఐపీఎల్ ఈవెంట్ లో చెన్నై-ముంబయి మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలిపారు. ధోనీ ఆటకోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. రేపు చెన్నైలో MI-CSK తలపడనున్నాయి.

News March 22, 2025

LRS రాయితీకి మార్చ్ 31 వరకే అవకాశం

image

మార్చ్ 31 నాటికి LRS క్రమబద్ధీకరణ చేసుకుంటే రుసుంలో 25% మినహాయింపు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీసీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు LRS దరఖాస్తు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు జాకీర్, విక్రమసింహారెడ్డి, వెంకటయ్య, వేణుగోపాల్ తదితరులున్నారు.

error: Content is protected !!