News March 18, 2025
NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 17, 2025
WGL: భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు శుక్రవారం రైతన్నలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. రెండు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర భారీగా పడిపోయింది. నేడు క్వింటా పత్తి ధర రూ.6,860 పలికింది. మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,940, గురువారం రూ. 6,930 ధరలు పలికాయి. ధరలు పడిపోవడం అన్నదాతలను నిరాశకు గురి చేస్తున్నాయి.
News October 17, 2025
భారత్తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

భారత్తో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
News October 17, 2025
HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్కు BSF DG

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.