News February 3, 2025

NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్‌కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Similar News

News October 29, 2025

రాబోయే 4 రోజులు కీలకం: మంత్రి సత్యకుమార్

image

మొంథా తుఫాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో సమీక్షిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలోని 2,555 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం ద్వారా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన తెలిపారు.

News October 29, 2025

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

image

తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. ఇంజినీరింగ్, శానిటేషన్ శాఖల అధికారులు, సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 29, 2025

సీజేఐపై దాడిని ఖండిస్తూ నవంబర్ 1న నిరసన: మందకృష్ణ

image

సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 1వ తేదీన హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ పిలుపునిస్తోందని, నిరసనను జయప్రదం చేయాలని కోరారు.