News February 3, 2025

NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్‌కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Similar News

News January 15, 2026

‘సెంటిమెంట్’ను నమ్ముకున్న ‘బలగం’ వేణు!

image

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమాతో హిట్ కొట్టిన వేణు మరోసారి జనాల ఎమోషన్‌ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ‘బలగం’లో ఓ ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని కథగా తీసుకొని జనాలను థియేటర్లకు రప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. తాజాగా విడుదలైన ‘ఎల్లమ్మ’ <<18865101>>గ్లింప్స్<<>> చూస్తే అదే ఫార్ములా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఈసారి దైవం-ఆచారం చుట్టూ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. మీకు గ్లింప్స్ ఎలా అనిపించింది?

News January 15, 2026

ఎల్లుండి నుంచి స్కూళ్లు.. శనివారమూ హాలిడే ఇవ్వాలని రిక్వెస్టులు

image

TG: ప్రభుత్వ జీవో ప్రకారం స్కూళ్లకు రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. శనివారం (17) నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే కనుమ జరిగిన నెక్స్ట్ రోజే సొంతూళ్ల నుంచి ఎలా రాగలమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. శనివారమూ హాలిడే ఇస్తే ఎలాగూ ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఫ్రెష్‌గా పిల్లలను పంపొచ్చంటున్నారు. మరి మీ పిల్లలను ఎప్పటి నుంచి స్కూళ్లకు పంపుతారు? కామెంట్ చేయండి.

News January 15, 2026

ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

image

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.