News March 21, 2025
NRPT: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి: ఎస్పీ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరాన్ని దృఢంగా మారుస్తాయని ఎస్పీ యోగేశ్ గౌతం అన్నారు. నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టు, వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం కాసేపు వాలీబాల్, క్రికెట్ ఆటలను ఆడారు. పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు వీలుగా మైదానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
కరీంనగర్: పల్లె పెడదారి పడుతోంది..!

ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలపై అభ్యర్థులకు అవగాహన లేకపోవడమే పల్లెపోరు పెడదారికి కారణమవుతోంది. ఉమ్మడి KNRలో కోల్ మైనింగ్, గ్రానైట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ జనరల్ వచ్చిన గ్రామాల్లో అభ్యర్థులు మద్యం, వందలమందితో ప్రచారం, ఓటుకు నోటు ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ, మద్యం పంపకాలపై ఎక్సైజ్ యాక్ట్ల అమలులో అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది.
News December 8, 2025
హీరోయిన్కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

హీరోయిన్పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.


