News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News January 10, 2026
జిల్లాల కుదింపు.. నల్గొండ రెండు జిల్లాలేనా..?

రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. చాలా జిల్లాల్లో గందరగోళం ఉండటంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలుగా సర్కార్ కుదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్ను ఒక్క జిల్లాకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సర్కార్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జిల్లాలు (NLG, యాదాద్రి, SRPT)గా విభజన చేశారు.
News January 10, 2026
నేడు ఇవి దానం చేస్తే?

పుష్య మాస శనివారాల్లో చేసే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో పేదలకు కంబళ్లు, దుప్పట్లు, వస్త్రాలను దానం చేయాలి. ఇవేకాక నల్ల నువ్వులు, బెల్లం, నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర మాసంలో స్నాన, జప, తపాదులతో పాటు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. పరులకు చేసే సాయమే దేవుడికి చేరే నిజమైన పూజ.
News January 10, 2026
పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. TGలో 14 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీలుగా ఉంది. అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. నిన్న రాత్రి పాడేరులో 4.1, పెదబయలు 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


