News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News October 21, 2025
శ్రీగిరిపై రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21వ తేదీ వరకు నిర్వహించే ఈ మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం సిద్ధం చేస్తోంది. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంలో భాగంగా పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 21, 2025
NCLTలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో లా రీసెర్చ్ అసోసియేట్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB/LLM, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.60వేలు (ఢిల్లీలో రూ.80వేలు). వెబ్సైట్: https://nclt.gov.in/
News October 21, 2025
కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలు

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి
★ మహానందీశ్వర స్వామి, యాగంటీశ్వర క్షేత్రం
★ ఆత్మకూరు రుద్రకోటేశ్వర స్వామి క్షేత్రం
★ ఓంకారేశ్వర ఆలయం
★ గడివేముల దుర్గా భోగేశ్వర స్వామి
★ బేతంచర్ల ముచ్చట్ల మల్లికార్జున స్వామి
★ ఆళ్లగడ్డ కాశింతల క్షేత్రం
★ కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వర స్వామి క్షేత్రం