News February 2, 2025

NRPT: గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల 6 వరకు ఛాన్స్

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు.  ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్  గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News October 26, 2025

HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

image

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్‌పేట-కృష్ణానగర్ రూట్‌లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్‌ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.

News October 26, 2025

HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

image

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్‌పేట-కృష్ణానగర్ రూట్‌లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్‌ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.

News October 26, 2025

అధికారులు ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి: కలెక్టర్

image

వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది తప్పనిసరిగా ప్రధాన కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వారి సచివాలయం ఫరిధిలోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర ఫోన్ నంబర్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.