News January 24, 2025

NRPT: చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

image

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, చట్టాలు, విద్యా హక్కు పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

Similar News

News November 21, 2025

సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.

News November 21, 2025

మంచిర్యాల: ఆసుపత్రిలో ఆరేళ్ల చిన్నారి మృతి

image

మంచిర్యాలలోని ఓ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాహితి (6) అనే చిన్నారి మృతి చెందింది. వైద్యం సరిగా అందించకపోవడంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్య అధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి న్యాయం చేయాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాగా గురువారం సైతం ఓ ఆసుపత్రిలో 4నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.

News November 21, 2025

హనుమకొండ: ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. డీడీజీ( స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో పది రోజులపాటు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్‌లో ఫిజికల్ ఫిట్ నెస్ నిర్వహించారు. ఆర్మీ అధికారులు కలెక్టర్‌ను కలిశారు.