News January 24, 2025
NRPT: చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, చట్టాలు, విద్యా హక్కు పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
Similar News
News November 19, 2025
ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్మడ్ అడవుల్లో మృతి చెందారు.
News November 19, 2025
ముత్యాలమ్మపాలెం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది. చింతకాయల పెంటయ్య, అర్జిల్లి బండియ్య గాయాలతోను మిగిలినవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు చింతకాయల ముత్యాలు మెరైన్ పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.


