News March 22, 2025
NRPT: జలం ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు..!

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవ సందర్భంగా వినూత్నంగా జల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలవనులను ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు.. అంటూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి? నీటిని వృథా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీచర్స్ పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రెండ్రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యే ఛాన్సుందని IMD పేర్కొంది. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఇదే టైమ్లో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయంది. ఉపరితల ఆవర్తనాలతో పలు జిల్లాల్లో రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు TPT, NLR, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
News October 15, 2025
1289 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1,289 హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, PE, MT/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్, 2025/జనవరి, 2026లో నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://ssc.gov.in/
News October 15, 2025
కూకట్పల్లిలో 9 మంది మహిళల బైండోవర్

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్ సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కూకట్పల్లి ఎంఆర్ఓ ఎదుట హాజరుపరిచి, మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేసినట్లు సీఐ కేవీ సుబ్బారావు, ఎస్సై నర్సింహ తెలిపారు. రోడ్డుపైన వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.