News February 21, 2025
NRPT: జిల్లాలో నేడు CM పర్యటన వివరాలు

నారాయణపేట జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా.. మధ్యాహ్నం 12:55కు సింగారం ఎక్స్ రోడ్ వద్ద హెలిప్యాడ్ ల్యాండ్ కానుంది. 1:15కు జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ పంప్ను ప్రారంభోత్సవం చేస్తారు.1:30కు అప్పక్ పల్లిలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన,1:50 GMC శిలాఫలక ఆవిష్కరణ, 2 గంటలకు వైద్య విద్యార్థులతో మాటామంతి, 2:10 సభా స్థలికి చేరుకుని ప్రసంగించనున్నారు.
Similar News
News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
News March 27, 2025
రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్ఖాన్పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 27, 2025
HYD: పెరుగుతున్న ట్యాంకర్ల పెండెన్సీ

HYDలో జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికి పెరిగుతోంది. జలమండలి పరిధిలో 75 ఫీలింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కానీ ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిగూడ, షాపూర్నగర్, గచ్చిబౌలి-2, మణికొండ, ఫతేనగర్లతోపాటు మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో డెలివరీకి 2, 3 రోజులు పడుతుందని జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.