News March 23, 2025
NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 29, 2025
సీతానగరం: వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

బొబ్బిలి మండలం కేశాయివలస సమీపంలో పోడు భూములలో మొక్కలకు నీరు పోస్తుండగా శుక్రవారం ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో సీతానగరం(M) కాశయ్యపేట చెందిన డ్రైవర్ పి.పోలిరాజు(56) అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ సీఐ సతీశ్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 29, 2025
పల్నాడు: మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశం

పల్నాడు జిల్లాలో మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలకు శ్రద్ధతో వైద్య పరీక్షలను అందించాలన్నారు. జిల్లాలో ఎడ్లపాడు, సిరిగిరిపాడు, ఆరేపల్లి, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాల గురించి చర్చించారు. రక్తహీనత సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందించాలని, ప్రసవ సమయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 29, 2025
సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశం: BHPL ఎస్పీ

సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ మాస ముఖ్య ఉద్దేశమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పట్టణ ముస్లీం పెద్దలు, పోలీసు ముస్లిం ఉద్యోగులకు ఎస్పీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం కలయికే రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసం అందరిలో సోదర భావం పెంపొందిస్తుందని, ఈ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎస్పీ ఆకాంక్షించారు.