News February 1, 2025
NRPT జిల్లా బాల సదన్ను సందర్శించిన కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్లో ఉన్న బాల సదన్ (అనాధ ఆశ్రమం)ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. బాల సదన్ గదులు, కిచెన్ను చూశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. బాల సదన్లో నూతనంగా నిర్మించబోయే పలు నిర్మాణ పనుల స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ కొత్తగా నిర్మించే పనులకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
వాగులో గల్లంతై అంగన్వాడీ టీచర్ మృతి

వాగులో గల్లంతై అంగన్వాడి టీచర్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం నందనంకు చెందిన అంగన్వాడి మొదటి సెంటర్ టీచర్ కృష్ణవేణి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై మజీద్ పూర్- బాటసింగారం దారి నుంచి వస్తుండగా మధ్య వాగులో కొట్టుకుపోయి గల్లంతై మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 30, 2025
మంచిర్యాల: తనిఖీ బృందాల నియామక దరఖాస్తు గడువు పొడిగింపు

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాల తనిఖీకి ఏర్పాటు చేయనున్న బృందాల్లో సభ్యులుగా నియామకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య గురువారం తెలిపారు. అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నస్పూర్లోని ఐడీఓసీలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.


