News March 7, 2025
NRPT: డిజిటల్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులతో డిజిటల్ లెర్నింగ్ పొందిన విద్యార్థుల ప్రజెంటేషన్ చూసి విద్యార్థులను కలెక్టర్ ప్రశంసించారు. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని విద్యార్థులు అన్నారు.
Similar News
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
కేతిరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తాడిపత్రికి వెళ్లినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో మిసిలేనియస్ అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇప్పటికే మీకు రక్షణ కల్పించాం, ఇంకేం కావాలి?’ అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అనంతరం కేతిరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
News October 15, 2025
KMR: పేకాటపై ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో మంగళవారం పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 18 మందిని అరెస్ట్ చేశారు. పిట్లం మండలం చిల్లర్గిలో 9 మందిని అరెస్ట్ చేసి రూ.4,030 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలంలో ఐదుగురిని పట్టుకొని రూ.1,250 నగదు, 4 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకోగా లింగంపేట్ మండలంలో నలుగురిని అదుపులోకి తీసుకోని రూ.6,400 పట్టుకున్నారు.