News March 13, 2025
NRPT: దూడపై చిరుత పులి దాడి

నారాయణపేట మండలం పిల్లిగుండ్ల తండా శివారులోని గంగ్యా నాయక్కు చెందిన దూడపై చిరుత పులి దాడి చేసింది. దీంతో రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి మల్లేష్ చనిపోయిన దూడను పరిశీలించారు. చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని చెప్పారు. వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లరాదని సూచించారు. చిరుత పులి సంచారంతో తమకేమీ చేస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Similar News
News November 21, 2025
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.
News November 21, 2025
ఫార్ములా ఈ కేసులో చట్టపరంగానే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చట్టపరంగానే చర్యలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన నల్గొండలో స్పందించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
News November 21, 2025
NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


