News March 13, 2025

NRPT: దూడపై చిరుత పులి దాడి

image

నారాయణపేట మండలం పిల్లిగుండ్ల తండా శివారులోని గంగ్యా నాయక్‌కు చెందిన దూడపై చిరుత పులి దాడి చేసింది. దీంతో రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి మల్లేష్ చనిపోయిన దూడను పరిశీలించారు. చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని చెప్పారు. వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లరాదని సూచించారు. చిరుత పులి సంచారంతో తమకేమీ చేస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News October 17, 2025

19న రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపిక

image

ఈ నెల 19 (ఆదివారం)న శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలోని రైఫిల్ షూటింగ్ రేంజ్‌లో అండర్-14, 17, 19 ఉమ్మడి జిల్లా బాలబాలికల రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపికలు ఉంటాయని ఉమ్మడి ఖమ్మం డీఈఓలు శ్రీజ, నాగలక్ష్మి తెలిపారు. 6వ తరగతి నుంచి ఆ పై చదువుతున్న విద్యార్థులు అక్టోబరు 19న ఉదయం 9 గంటలకు స్టడీ సర్టిఫికేట్, ఫొటోతో కూడిన అర్హత ఫారంతో హాజరు కావాలని సూచించారు.

News October 17, 2025

ఉపమాక బాలికను అభినందించిన గవర్నర్, మంత్రి

image

సూపర్ జీఎస్టీ 2.0 చిత్రలేఖనం పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉపమాకకు చెందిన బాలిక కే.చైత్రిని గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ ప్రశంసలు పొందింది. నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న కె.చైత్రిని సూపర్ జీఎస్టి 2.0 చిత్రలేఖనం పోటీల్లో మండల స్థాయి, జిల్లాస్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ బాలికను గురువారం కర్నూలులో గవర్నర్, మంత్రి అభినందించినట్టు హెచ్ఎం శ్రీలక్ష్మి చెప్పారు.

News October 17, 2025

బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుంది: MP కావ్య

image

కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. HNK కాంగ్రెస్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఏకతాటికి తీసుకొచ్చి అందరితో కలిసిపోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు.