News March 17, 2025
NRPT: నిలువు రాళ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

ముడుమల్ గ్రామంలోని ప్రాచీన ఖగోళ శాస్త్రానికి చెందిన నిలువురాళ్లను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. యునెస్కో గుర్తింపు కోసం నిలువురాళ్లను పరిశీలిస్తుండటంతో మంత్రి పర్యటన ఆసక్తి రేపింది. ప్రాచీన కాలంలో నిలువురాళ్ల ద్వారా సమయాన్ని చెప్పేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఆర్డిఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
‘కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి’

కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల, ఇప్పటికే జరిగిన ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం అనువుగా లేనందున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో స్థలాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్కడ త్వరగా సర్వే చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలన్నారు.
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.