News March 17, 2025
NRPT: నిలువు రాళ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

ముడుమల్ గ్రామంలోని ప్రాచీన ఖగోళ శాస్త్రానికి చెందిన నిలువురాళ్లను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. యునెస్కో గుర్తింపు కోసం నిలువురాళ్లను పరిశీలిస్తుండటంతో మంత్రి పర్యటన ఆసక్తి రేపింది. ప్రాచీన కాలంలో నిలువురాళ్ల ద్వారా సమయాన్ని చెప్పేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఆర్డిఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
రాజేంద్రనగర్లోని NIRDPRలో ఉద్యోగాలు

రాజేంద్రనగర్లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT
News October 23, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత ప్రభావం క్రమంగా పెరుగుతోంది. బిచ్కుంద మండలంలో 33.8 సెంటీగ్రేడ్ కాగా.. మద్నూర్ మండలంలో 33.6, పాల్వంచ 33,5, నస్రుల్లాబాద్ 33, బీర్కూర్ 32.8, అత్యల్పంగా రాజంపేట మండలంలో 30.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News October 23, 2025
జూరాలకు 15,241 క్యూసెక్కుల వరద

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. గురువారం ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్ -2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.