News March 17, 2025
NRPT: నిలువు రాళ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

ముడుమల్ గ్రామంలోని ప్రాచీన ఖగోళ శాస్త్రానికి చెందిన నిలువురాళ్లను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. యునెస్కో గుర్తింపు కోసం నిలువురాళ్లను పరిశీలిస్తుండటంతో మంత్రి పర్యటన ఆసక్తి రేపింది. ప్రాచీన కాలంలో నిలువురాళ్ల ద్వారా సమయాన్ని చెప్పేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఆర్డిఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
భారత్vsదక్షిణాఫ్రికా.. రెండో రోజు ముగిసిన ఆట

గువాహటిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పంత్ సేన 480 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జైస్వాల్(7), రాహుల్(2) ఉన్నారు. రేపు దూకుడుగా ఆడి లీడ్ దిశగా సాగితేనే మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ఉంది.
News November 23, 2025
వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.
News November 23, 2025
మావోయిస్టు కీలక నేతల్లో సిక్కోలు వాసులు

మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ కీలక నేతల్లో సిక్కోలు వాసులు ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్ కౌంటర్లో జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు మృతిచెందగా, తాజాగా మరేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో జిల్లాలోని బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు కీలకనేత మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మరణించారు. అదే ప్రాంతానికి చెందిన చెల్లూరు నారాయణరావు(సూరన్న) అజ్ఞాతంలో ఉన్నారు.


