News March 17, 2025
NRPT: నిలువు రాళ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

ముడుమల్ గ్రామంలోని ప్రాచీన ఖగోళ శాస్త్రానికి చెందిన నిలువురాళ్లను ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. యునెస్కో గుర్తింపు కోసం నిలువురాళ్లను పరిశీలిస్తుండటంతో మంత్రి పర్యటన ఆసక్తి రేపింది. ప్రాచీన కాలంలో నిలువురాళ్ల ద్వారా సమయాన్ని చెప్పేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఆర్డిఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.
News April 20, 2025
ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం
News April 20, 2025
ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.