News August 9, 2024

NRPT: నేడు తేళ్ల పంచమి.. ఇదే ఇక్కడ స్పెషల్

image

నారాయణపేటకు సమీపంలోని కర్ణాటకలోని సరిహద్దు గ్రామం కందుకూరులో గుట్టపై వెలసిన కొండమేశ్వరి దేవి ఆలయంలో నేడు తేళ్ల పంచమి నిర్వహిస్తారు. దేవి ఉత్సవాల్లో భాగంగా శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచామితి తిథి రోజు(నేడు) తేళ్ల పంచమి నిర్వహిస్తారు. అమ్మవారు, తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అనంతరం అక్కడి రాళ్ల కింద దాగి ఉన్న తేళ్లను పట్టుకొని ఒంటిపై వేసుకుంటారు. ఎక్కడ వేసుకున్నా తేళ్లు కుట్టకపోవడం ఇక్కడి విశేషం.

Similar News

News October 25, 2025

MBNR: బాధితులకు న్యాయం జరుగేలా చూడాలి: SP

image

MBNR జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కోర్ట్ డ్యూటీ, కోర్ట్ లైజన్ అధికారులతో ఎస్పి డి.జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరుగేలా పోలీస్ అధికారులు సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కోర్ట్ డ్యూటీ, లైజన్ అధికారులకు సంబంధిత ఫైళ్లు, సాక్షులు, పత్రాలు సమయానికి కోర్టులో సమర్పించే విధంగా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

News October 25, 2025

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదవాలని క‌లెక్ట‌ర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం హన్వాడ మండలంలో కెజీబీవీని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో కెజీబీవీని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో విద్యా బోధ‌న‌, భోజ‌నం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

News October 25, 2025

కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్‌పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్‌లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.