News March 25, 2024

NRPT: పండుగ పూట విషాదం… ట్యాంకు కూలి చిన్నారి మృతి

image

నారాయణపేటలో హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నీటి ట్యాంకు కూలి పడి సాయి ప్రణతి(13) అనే చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానిక గోపాల్‌పేట వీధిలో కామ దహనం చేసిన సందర్భంగా నీటి ట్యాంకు మంటల వేడికి గురి కాగా.. ట్యాంకు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ట్యాంకు కూలి పడటంతో ఘటన జరిగింది. చిన్నారి మృతితో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 6, 2026

MBNR: అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రో కె పద్మావతి తెలిపారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు పిజీలో 55%, SC, ST అభ్యర్థులకు 50% ఉండలన్నారు. నెట్ సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News January 6, 2026

ALERT.. చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: MBNR SP

image

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

News January 5, 2026

పాలమూరు: BRS మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను మంగళవారం ఉదయం 9:00 గంటలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల ప్రాజెక్టు, ఎడుమ, కుడి కాలువలను పరిశీలించనున్నారు. అనంతరం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా సందర్శించనున్నారు.