News March 21, 2025

NRPT: పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు

image

నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు కాగా, 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు చెప్పారు. పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారని అన్నారు.

Similar News

News December 7, 2025

NTR: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

image

శబరిమలై వెళ్లేవారికై విజయవాడ మీదుగా కొల్లం వరకు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న నం.07117 సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లం, 20న నం.07121 చర్లపల్లి-కొల్లం, 24న నం.07123 H.S. నాందేడ్-కొల్లం, 15న నం.07118 కొల్లం-చర్లపల్లి, 22, 26న నం.07122, నం.07124 కొల్లం-చర్లపల్లి మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.

News December 7, 2025

ADB: లక్ష ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. మనమే గెలవాలె

image

పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు డబ్బు, మద్యం, సరుకులతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. నామినేషన్ల నుంచి ఖర్చు లెక్కలు పెరుగుతున్నాయి. ఓటర్లు కూడా తమ ఓటుకు ఎక్కువ ధర పలుకుతుండటంతో బేరసారాలకు దిగుతున్నారు. సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారింది. పగలంతా ప్రచారం చేసి రాత్రి అవ్వగానే ఓటర్లకు విందులు, వినోదాలు ఏర్పాటుచేస్తున్నారు. అందరినీ తమతోనే ఉంచుకుంటూ ప్రత్యర్థితో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.

News December 7, 2025

ఆడపిల్లలు కాటుక ఎందుకు పెట్టుకోవాలి?

image

కాటుక అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం. వివాహ వేడుకల్లో దీవెనల కోసం దీన్ని ధరిస్తారు. ఆరోగ్యపరంగా.. కాటుక కళ్లకు చల్లదనం, ఉపశమనం ఇస్తుంది. ఇది కంటిపై ఒత్తిడి, చికాకును తగ్గిస్తుంది. సూర్యకిరణాల నుంచి కంటి ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి స్థానం ఉంది. అయితే సహజ కాటుకే ఉత్తమమైనది. నెయ్యి దీపం మసితో తయారు చేసుకున్న కాటుకతో ప్రయోజనాలెక్కువ. బయట కొనే కాటుకలను నాణ్యత చూసి ఎంచుకోవడం మంచిది.