News March 21, 2025
NRPT: పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు

నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు 7,613 మంది విద్యార్థులు హాజరు కాగా, 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు చెప్పారు. పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారని అన్నారు.
Similar News
News November 28, 2025
మరిపెడలో అత్యధికం.. చిన్నగూడూరులో అత్యల్పం!

మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డు స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అత్యధికంగా మరిపెడ మండలంలో ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో ఉన్నాయి. మరిపెడ(M)లో 48 పంచాయతీలు, 396 వార్డులు ఉన్నాయి. చిన్నగూడూర్(M)లో 11 గ్రామ పంచాయతీలు, 96 వార్డులు ఉన్నాయి.
News November 28, 2025
HYD: అభివృద్ధికి నిదర్శనంగా ఆదిబట్ల !

ఆదిబట్ల మున్సిపాలిటీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మినీ గచ్చిబౌలిగా పేరుగాంచింది. IT సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డితో ఆదిభట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా, అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంగా ఆదిభట్లగా పేరు పొందింది.
News November 28, 2025
మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.


