News February 25, 2026

NRPT: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

image

ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతను సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అన్నారు.

Similar News

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.

News April 15, 2026

న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

image

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్‌లైన్ కాల్‌కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News April 15, 2026

కరీంనగర్‌లో ఠాగూర్ సీన్ రిపీట్..!

image

KNRలో ఠాగూర్ సినిమాలోని సీన్‌ రిపీటైంది. వేములవాడ(M) శాత్రాజ్‌పల్లికి చెందిన సాహెబ్ బీ(60) గుండెవ్యాధితో కోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న సర్జరీ చేయగా మృతిచెందింది. బతికే ఉన్నట్లు, వైద్యం చేస్తున్నట్లు కుటుంబసభ్యులను మభ్యపెడుతుండగా, అనుమానంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. డాక్టర్లపై KNR-2 టౌన్ PSలో కేసు నమోదైంది.