News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
Similar News
News October 17, 2025
ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం లేదు: డిప్యూటీ కమిషనర్

ఉమ్మడి జిల్లాలో ఎటువంటి కల్తీ మద్యం లేదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి అన్నారు. విజయనగరంలోని శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో తమ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారని, ఎక్కడ కల్తీ మద్యం లేదని చెప్పారు. వైన్ షాపులు, బార్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రజలకు సురక్షతమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు.
News October 17, 2025
కామారెడ్డి: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్కు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
శ్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు DRDA వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగంచేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీనిధి గోడ పత్రికలను కలెక్టర్తో కలిసి పీడీ నరసయ్య ఆవిష్కరించారు. శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల మహిళలు తమ జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఇతర ఆర్థికఅవసరాలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.