News March 14, 2025

NRPT: ‘పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 19లోపు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితాలో సవరణలు చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు.

Similar News

News October 14, 2025

RMG: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు: కమిషనర్లు

image

సింగరేణి రామగుండం-3 ఏరియాలో సీఎంపీఎఫ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, డా.కె. గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ సేవలు ఇప్పుడు పూర్తిగా C-CARES పోర్టల్ ద్వారా పారదర్శకంగా అందుతున్నాయని తెలిపారు. 355 రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లను GM నరేంద్ర సుధాకరరావుకు అందజేశారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా జీరో పెండింగ్ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 14, 2025

MBNR: పోలీస్ ఫ్లాగ్ డే.. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: SP

image

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలలో పాల్గొనాలని ఎస్పీ డి.జానకి యువత, విద్యార్థులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు పిలుపునిచ్చారు. పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. ఈ నెల 23వ తేదీ లోగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో తమ రచనలు/చిత్రాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు.

News October 14, 2025

SNపాడులో 17న జాబ్ మేళా..!

image

SNపాడులోని DMSVK మహిళా కళాశాలలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజలు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు తెలిపారు.