News March 14, 2025

NRPT: ‘పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 19లోపు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితాలో సవరణలు చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు.

Similar News

News February 12, 2026

మాజీమంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడుతారా..? పార్టీ వేటు వేస్తుందా..!

image

జగిత్యాల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన వారికి బీఫామ్ ఇవ్వలేదని అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయనపై పార్టీ వేటు వేస్తుందని సన్నిహితులతో అన్నట్టు ప్రచారం. అయితే, పార్టీ వీడేందుకు సిద్ధమయ్యాకే ఇండిపెండెంట్‌లకు ప్రచారం చేసినట్లు సమాచారం.

News February 12, 2026

ఓపిక తగ్గిపోతోందా?

image

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.

News February 12, 2026

VJA: ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు 13వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు మహోత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.