News February 3, 2025

NRPT: పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి

image

నులి పురుగులు నివారణకు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఈనెల 10న జరిగే జాతీయ నులి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఒక సంవత్సరం వయస్సు నుంచి 19 ఏళ్ల లోపు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News December 7, 2025

అమలాపురం: డీసీసీ పగ్గాల కోసం 14 మంది పోటీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా వారధిగా నిలిచే ఈ కీలక పదవి కోసం ఏకంగా 14 మంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్తూరు శ్రీనివాస్, వంటెద్దు వెంకన్ననాయుడు, ముషిణి రామకృష్ణారావు సహా పలువురు హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పేర్లపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తోందని సమాచారం.

News December 7, 2025

ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

image

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్‌లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్‌తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.

News December 7, 2025

SKLM: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.