News April 11, 2025

NRPT: ‘పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి’

image

పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గర్భిణీలు, బరువు తక్కువగా ఉన్న పౌష్టికాహారం అందించాలన్నారు.

Similar News

News December 2, 2025

PDPL: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష

image

కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, నామినేషన్ల ప్రకటన, బ్యాలెట్ పేపర్ ముద్రణ, రవాణా సౌకర్యాలు, అభ్యర్థుల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహణ, ప్రతి మండలానికి బ్యాలెట్ బాక్స్ పంపిణీ వంటి అంశాలు చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం, సరైన లైటింగ్ ఉండేలా ఆదేశించారు.

News December 2, 2025

జగిత్యాల: ‘సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత’

image

సైబర్ భద్రత ప్రతి పౌరుని బాధ్యత అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ‘ఫ్రాడ్ క ఫుల్ స్టాప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్ ఆడిటోరియం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల గురించి రక్షించుకోవాలంటే అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.

News December 2, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* కామారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ కు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి
* నాగిరెడ్డిపేట్: ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం
* బిచ్కుంద: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ బిజెపి నాయకులు
*లింగంపేట్: మండలంలో చిరుత పులి సంచారం
* గాంధారి: సోమారం సర్పంచ్ ఏకగ్రీవం
* బిక్కనూర్: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
* మూడో విడత నామినేషన్లకు సర్వం సిద్ధం