News March 17, 2025

NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 18, 2025

కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

image

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

News March 18, 2025

లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

image

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.

News March 18, 2025

భువనగిరి: హాస్టళ్లలో ఫిర్యాదు బాక్స్‌ల ఏర్పాటుకు సిద్ధం

image

సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదుల పెట్టెలో వేయోచ్చు. కలెక్టర్ తనిఖీలకు వచ్చినప్పుడు, వారంలో ఒకసారి పెట్టెను తెరిచి అందులోని ఫిర్యాదులను చూసి పరిష్కారం చూపుతారు. కలెక్టరేట్లో ఫిర్యాదు పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.

error: Content is protected !!