News March 17, 2025

NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 26, 2025

పల్నాడు: హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం ఇలా..!

image

పెదకూరపాడు నియోజకవర్గంలోని హెడ్ కానిస్టేబుల్ చైన్ లింక్ ద్వారా తోటి పోలీసులు, సామాన్య ప్రజలతో డబ్బులు కట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత డాలర్లు కొనుగోలు చేస్తే తిరిగి వస్తాయి అంటూ కట్టించాడని, తమ వద్ద కమీషన్ పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. చివరకు అతను చెప్పిన విధంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.

News November 26, 2025

జన్నారం: గంటలో స్పందించిన అధికారులు

image

జన్నారం బస్టాండ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం సాయంత్రం 4 గంటలకు WAY2NEWSలో వార్త పబ్లిష్ అయింది. అధికారులు గంటలో స్పందించి బస్టాండ్‌లోని ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తీసేయించారు.

News November 26, 2025

HNK: ప్రయాణికుల సలహాల కోసం ‘డయల్ యువర్ డీఎం’

image

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు వారి సూచనల కోసం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రజలు ఈ నెల 27, గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 8977781103 నెంబరుకు ఫోన్ చేసి, డిపో అభివృద్ధికి విలువైన సలహాలను అందించాలని ఆయన కోరారు.