News February 3, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.
News September 18, 2025
ASF: ‘అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి’

జిల్లాలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఛైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సీసీఈ నివేదికలు నిర్వహించాలని తెలిపారు.