News February 3, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.
Similar News
News February 4, 2025
‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్కతాలోని భారత ప్రభుత్వ మింట్లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.
News February 4, 2025
రెండు మండలాలతో అమీన్ పూర్ మండల పరిషత్
రాష్ట్రంలోని అతి చిన్న మండల పరిషత్గా అమీన్ పూర్ నిలిచింది. రెండు గ్రామపంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్ పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
News February 4, 2025
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO
దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.