News February 3, 2025

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.

Similar News

News January 13, 2026

నేలకొండపల్లి బౌద్ధస్తూపంలో అరుదైన శంఖం లభ్యం

image

చారిత్రక నేలకొండపల్లి బౌద్ధస్తూపం వద్ద పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో అరుదైన శంఖం లభ్యమైంది. దీనిపై ‘భగవతో అష్టభుజసామిన’, ‘నాగార్జునకొండ’ అనే లేబుల్స్ ఉండటం విశేషం. ఈ ఆనవాళ్లు నేలకొండపల్లికి, నాగార్జునకొండ బౌద్ధ సంస్కృతికి మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని బలపరుస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పురాతన వస్తువును పరిశీలించిన అధికారులు,ఇక్కడి చరిత్రపై మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు.

News January 13, 2026

నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

image

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.

News January 13, 2026

‘సీఎం పర్యటనతో పాలమూరు అభివృద్ధి’

image

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 17న జిల్లాలో పర్యటించనున్నారని, ఇది పాలమూరు అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రూ.1200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని, అందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.