News April 7, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత శాఖకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మొత్తం 25 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
CWCలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్(CWC) 11 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, MBA/PGDM, MSc(స్టాటిస్టిక్స్), BSc(స్టాటిస్టిక్స్), BBA, ఎంటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 12, 2025
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్!

టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇన్డైరెక్ట్గా చెక్ పెట్టారు. ‘తండ్రి అయ్యాకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. అంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు. నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా ఉండాలని డిసైడయ్యా’ అని పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.
News November 12, 2025
రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


