News February 11, 2025

NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం నాలుగు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. భూముల సమస్యలు కోర్టు పరిదిలో పరిష్కరించుకోవాలని చెప్పారు.

Similar News

News October 28, 2025

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.

News October 28, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.

News October 28, 2025

అమలాపురం: ACB అధికారుల నంబర్ ఇదే..!

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవినీతి శాఖ రూపొందించిన పోస్టర్లను జిల్లా రెవెన్యూ, రవాణా శాఖ, తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ట్రెజరీ కార్యాలయం వద్ద అతికించారు. ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే 9440446160కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ అధికారులు కోరారు.