News April 1, 2025

NRPT: ‘ప్రభుత్వం LRS గడువు పొడిగించాలి’

image

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు మరో రెండు నెలలు పొడిగించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రచారం, అవగాహన లేని కారణంగా చాలా మంది ఎల్ఆర్ఎస్ రుసుం కట్టలేదని అన్నారు. వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని కోరారు. వెంచర్లు చేసిన వారికి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించాలని అన్నారు.

Similar News

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.

News November 20, 2025

హిడ్మా అనుచరుడికి 14 రోజుల రిమాండ్: రావులపాలెం CI

image

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు. సరోజ్.. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత వచ్చారా? లేక ముందే ఇక్కడ తలదాచుకున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరోజ్‌ను కొత్తపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని RJY జైలుకు తరలించారు.