News April 1, 2025

NRPT: ‘ప్రభుత్వం LRS గడువు పొడిగించాలి’

image

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు మరో రెండు నెలలు పొడిగించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రచారం, అవగాహన లేని కారణంగా చాలా మంది ఎల్ఆర్ఎస్ రుసుం కట్టలేదని అన్నారు. వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని కోరారు. వెంచర్లు చేసిన వారికి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించాలని అన్నారు.

Similar News

News November 24, 2025

HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

image

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.  దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.

News November 24, 2025

UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>UCIL<<>>)107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ కాంపిటెన్సీ, మైనింగ్ మేట్, ఫోర్‌మెన్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ucil.gov.in/

News November 24, 2025

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.