News February 12, 2025

NRPT: ప్రేమికుల రోజు అడ్డుకుంటాం: బజరంగ్ దళ్

image

నారాయణపేటలో ప్రేమికుల రోజును అడ్డుకుంటామని బజరంగ్ దళ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, విహెచ్పి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నారాయణపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేమికులకు వ్యతిరేకం కాదని అన్నారు. 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారని, ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.

Similar News

News December 4, 2025

సూర్య ఘర్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

image

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News December 4, 2025

NZB: ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష

image

పంచాయతీ ఎన్నికల భద్రత చర్యలపై డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉమ్మడి నిజమాబాద్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా వివరించారు. డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. NZB సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News December 4, 2025

TU: డిగ్రీ పరీక్షలకు 51 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని డిగ్రీ I, III, V, (రెగ్యులర్)& II, IV, VI సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం జరిగిన పరీక్షలకు 4,887 మంది విద్యార్థులకు 4,664 మంది హాజరు కాగా 233 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 299 మందికి గాను 271 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.