News March 8, 2025

NRPT: ఫర్టిలైజర్ డీలర్స్‌తో వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం

image

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో ఫర్టిలైజర్ షాపుల డీలర్లంతా వ్యవసాయ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. శుక్రవారం నారాయణపేట మండల పరిధిలోని సింగారం గ్రామ రైతు వేదికలో జిల్లాలోని వివిధ గ్రామాల ఫర్టిలైజర్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రికార్డులు సరిచూసుకొని, రాబోయే వర్షాకాలం రైతులకు అన్ని రకాల ఎరువులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

Similar News

News November 20, 2025

పల్నాడు వీర్ల గుడిని నిర్మించింది ముస్లింలని మీకు తెలుసా.?

image

పల్నాడు వీర్ల గుడిని ఔరంగజేబు సైన్యాధిపతులుగా పనిచేసిన జాఫర్, ఫరీదులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నాగులేరు ఒడ్డున గుండ్రాయిలను పొయ్యి కింద వాడుకోగా, ఆగ్రహించిన చెన్నకేశవ స్వామి అవి వీరుల రూపాలని చెప్పాడు. ప్రాయశ్చిత్తంగా వీరుల గుడిని నిర్మించిన ఆ ఇద్దరు సైన్యాధిపతులు, తాము కూడా పూజలు అందుకోవాలనే కోరికతో వీర్ల గుడిలోనే సమాధి అయ్యారు. వారి సమాధులు నేటికీ గుడిలో ఉండటం ఇక్కడి విశేషం.

News November 20, 2025

సంగారెడ్డి: 10 పరీక్ష ఫీజు.. నేడే చివరి తేదీ: డీఈవో

image

పదో తరగతి పరీక్ష ఫీజు గురువారం చివరి తేది అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని పాఠశాలలకు కలిపి రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పరీక్షా ఫీజును నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, గడువు పొడిగించమని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.

News November 20, 2025

సంగారెడ్డి: 10 పరీక్ష ఫీజు.. నేడే చివరి తేదీ: డీఈవో

image

పదో తరగతి పరీక్ష ఫీజు గురువారం చివరి తేది అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని పాఠశాలలకు కలిపి రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పరీక్షా ఫీజును నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, గడువు పొడిగించమని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.