News February 22, 2025
NRPT: బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ

నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లాలో అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి తొలి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం నుంచి ఇంటి నిర్మాణానికి పత్రం అందుకున్న మహిళ ఆయనను కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేసి, ధన్యవాదాలు తెలిపింది.
Similar News
News March 22, 2025
ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
News March 22, 2025
BHPL: పుష్కరాల ఏర్పాట్లపై మొబైల్ యాప్.. పరిశీలించిన కలెక్టర్

పుష్కరాల్లో చేసిన ఏర్పాట్ల సమాచారం భక్తులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ తయారు చేయు అంశాలను భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. మొబైల్ యాప్లో సమగ్ర సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు. టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రధాన కూడళ్లలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూచించారు. ప్రవేశ మార్గాలు, రోడ్లు మరమ్మతులు, మెరుగుదల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
News March 22, 2025
యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందాం: కలెక్టర్

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని సచివాలయంలో నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎక్కడన్నా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.