News March 20, 2025

NRPT: బడ్జెట్ పత్రాలు దహనం చేసిన నేతలు

image

బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో PDSU నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

Similar News

News April 18, 2025

ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలిస్తే..

image

ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడడంతో పాటు బలోపేతం అవుతాయని, నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంని, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి/ నువ్వుల/ సన్ ఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చని.. 15-20min పుక్కిలించి, తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

News April 18, 2025

కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

image

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.

News April 18, 2025

కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

image

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.

error: Content is protected !!