News February 5, 2025
NRPT: బావిలో మునిగి బాలుడు మృతి

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News February 9, 2025
ఢిల్లీ అసెంబ్లీలో తగ్గిన మహిళల సంఖ్య

ఢిల్లీ అసెంబ్లీలో మహిళల సంఖ్య తగ్గింది. గత ఎన్నికల్లో 8మంది ఎమ్మెల్యేలుగా గెలవగా ఈసారి ఐదుగురే విజయం సాధించారు. వీరిలో బీజేపీ నుంచి నలుగురు ఉండగా, ఆప్ నుంచి ఆతిశీ ఉన్నారు. ఇక మొత్తంగా గెలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బీజేపీ క్యాండిడేట్ కర్నాలీ సింగ్(రూ.259 కోట్లు) నిలిచారు. అత్యధిక కేసులున్న(19) ఎమ్మెల్యేగా ఆప్ నేత అమానుతుల్లా ఖాన్ ఉన్నారు.
News February 9, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

AP: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారి నుంచి వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 OCT 15 ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే దరఖాస్తులు స్వీకరించనుండగా, లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
News February 9, 2025
పరగడుపున వీటిని తింటున్నారా?

పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఏమీ తినకుండా నిమ్మ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే పొట్ట ఉబ్బరం, అజీర్తి కలుగుతాయి. తీపి పదార్థాలు, టీ, కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఐస్క్రీమ్, కూల్డ్రింక్స్ తాగకూడదు. నిల్వ పచ్చళ్లు, చీజ్ తినకూడదు.